newsseals.com
DEVOTIONAL

ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఈవో సింఘాల్

VijayaBhaskar September 11, 2025
newsseals-eottd
Spread the love

ప‌లు శాఖ‌ల‌ను ప‌రిశీలించిన అనిల్ కుమార్

తిరుప‌తి : టీటీడీ నూత‌న ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. మొదటగా అకౌంట్స్, అన్నదానం, బోర్డు సెల్, ఐ.టి, సోషల్ మీడియా, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను త‌నిఖీ చేశారు. సదరు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా టిటిడి ఈవోకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు నూతన సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు.

అంతకు ముందు ఈవో ఛాంబర్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం నుండి వచ్చిన వేద పండితులు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు వేదాశీర్వచనం చేశారు. ముందుగా టిటిడి పరిపాలనా భవనానికి టిటిడి ఈవో చేరుకోగానే, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు. టిటిడి ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సిఏవో ఓ. బాలాజీ, అదనపు ఎఫ్ఏసిఏవో రవిప్రసాద్, చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణ తదితరులు ఉన్నారు.