newsseals.com
SPORTS

ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం

VijayaBhaskar February 26, 2026
newsseals-AndyFlower
Spread the love

మేం త‌ప్ప‌కుండా గెలుస్తామ‌న్న ఆండీ ఫ్ల‌వ‌ర్

చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది చెన్నై. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భార‌త జ‌ట్టు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గ‌తంలో ఇదే టోర్నీలో ఛాంపియ‌న్ గా నిలిచింది టీమిండియా. కానీ ఇప్పుడు సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. ఈ సంద‌ర్బంగా జింబాబ్వే జ‌ట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్ స్పందించాడు. కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌క‌మ‌ని పేర్కొన్నాడు. టోర్నీలో ఉండాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. త‌మ జ‌ట్టు ప్ర‌స్తుతం గ‌తంలో కంటే బ‌లంగాఉంద‌న్నాడు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ప‌టిష్టంగా ఉన్నామ‌ని, భార‌త జ‌ట్టు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటోంద‌న్నాడు ఆండీ ఫ్ల‌వ‌ర్.

నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు టాస్ గెలిచి బోర్డులో కనీసం 160 పరుగులు చేస్తే జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేయాలని నేను కోరుకుంటున్నానని చెప్పాడు. ఆపై భారతదేశంను ఛేజింగ్ చేయమని అడుగుతామ‌ని పేర్కొన్నాడు. జింబాబ్వే అలా చేయగలిగితే, వారు భారతదేశానికి కఠినమైన సమయం ఇవ్వగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపాడు. ఎందుకంటే ఈ భారత జట్టుకు ఒకప్పుడు ఉన్నంత బలం లేదు. గంభీర్ నాయకత్వంలో, ఈ భారత జట్టు మంచి ప్రత్యర్థిపై 150+ మొత్తాన్ని విజయవంతంగా ఛేదించడం నాకు కనిపించడం లేద‌న్నాడు.

గంభీర్ తన రాజకీయాలు, అహంకారంతో డ్రెస్సింగ్ రూమ్ లోపల జట్టు వాతావరణాన్ని అక్షరాలా దెబ్బతీశాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బయటి నుండి చూస్తే, ఆటగాళ్ళు అతనితో అంత సౌకర్యంగా లేరని అనిపిస్తుందని అన్నాడు.