హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

VijayaBhaskar · March 10, 2026
Spread the love

అందాయ‌న్న వ‌ర్ల పాప‌య్య

హైద‌రాబాద్ : హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి 32 ఫిర్యాదులు అందిన‌ట్లు వెల్ల‌డించారు అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య‌. ఆక్ర‌మ‌ణ‌దారుల క‌బ్జాల గురించి వాపోయారు బాధితులు. త‌మ‌కు వారి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఇదిలా ఉండా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల్ లో ని TNGO’s Colony పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేసారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలం గతంలో అధికారికంగా కేటాయించబడిన ప్లాట్ల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. ఆక్రమణలను వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.

శంషాబాద్ లోని ఎం.బి. మిషన్ కంపౌండ్‌లో ఉన్న స‌మాదులు క‌బ్జాకు గురౌతున్నాయ‌ని HYDRAA ప్రజావాణి లో ఎం.బి. చర్చి, ఎం.బి. సమాధుల నిర్వహణ కమిటీ ప్రతినిధి ప‌విత్ర సాగ‌ర్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 619లో ఉన్న చర్చి సమాధులకు స‌బంధించిన‌ భూమి శతాబ్దానికి పైగా చర్చికి చెందినదిగా ఉందని తెలిపారు. ఈ భూమి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో కూడా నమోదై ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 618గా చూపిస్తూ రికార్డులను మార్పులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అక్రమంగా కంచెలు వేయడం, నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని వాపోయారు.