జ‌గ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌పై ఆనం ఎద్దేవా

VijayaBhaskar · April 15, 2026
Spread the love

ఏపీని విధ్వంసానికి గురి చేసిన మాజీ సీఎం

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి రేపటి జువ్వలదిన్నె పర్యటనపై నిప్పులు చెరిగారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ హయాంలో, పాలకులు పరిపాలన కంటే విధ్వంసానికి బీజం వేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జగన్ రెడ్డికి ఇప్పుడు ‘గన్ కల్చర్’ కావాల్సి వచ్చిందన్నారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

లక్షలాది మంది రైతులు నిరాశ్రయులైనా, కన్నెత్తి చూడని దుర్మార్గుడు జగన్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చ‌స్త్రశారు మంత్రి. ఒకరు బాగుపడితే చూడలేని మ‌న‌స్త‌త్వం త‌న‌ది అని పేర్కొన్నారు. జగన్ ఇంట్లో ఉండి పబ్జి ఆడుకోవడం బెటర్ అన్నారు. వైసీపీ నాయకులు ఎవరైనా హద్దులు మీరితే తాటతీస్తాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌. రాష్ట్రం నుండి పిట్టలు ఎగిరినట్లు ఎగురుతారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.