తమిళ‌నాడు కేబినెట్ లో మ‌రో ఇద్ద‌రికి చోటు

VijayaBhaskar · May 22, 2026
Spread the love

ప్ర‌మాణ స్వీకారం చేసిన వ‌న్ని అర‌సు, షాజ‌హాన్
చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. ఇప్ప‌టికే 23 మందిని తీసుకున్నారు. వారిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండ‌గా ఇంకో ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రులుగా కొలువు తీరారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపిన వీసీకే పార్టీ, ముస్లిం లీగ్ పార్టీల‌ను కూడా కేబినెట్ లో చేరాల‌ని కోరారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

ఆయ‌న కోరిక‌ను మ‌న్నించాయి ఆయా పార్టీలు. ఈ మేర‌కు కీల‌క స‌మావేశం నిర్వ‌హించి తాము కూడా కేబినెట్ లో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ప్రధాన సచివాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారై మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రాజేష్ కుమార్ , పి. విశ్వనాథన్, విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన వన్ని అరసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఏ.ఎం.ఎం. షాజహాన్ క‌లిశారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం విజ‌య్.