ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

VijayaBhaskar · May 30, 2026
Spread the love

రేపు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నుంది

న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ట్టుండి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఇండియాకు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె ప్ర‌ముఖ తాజ్ మ‌హ‌ల్ ను ఆదివారం సంద‌ర్శించనున్నారు. ఈ విష‌యం ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. అయితే ట్రంప్ కూతురు కావ‌డంతో భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆమె ఆగ్రాకు నేరుగా చేరుకుంటార‌ని స‌మాచారం.

మరుసటి రోజు ఉదయం ఆమె తాజ్ మహల్‌ను సందర్శించనున్నారని అధికారులు వెల్ల‌డించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కానీ ఎవ‌రికీ స‌మాచారం లేదు. త‌ను ఒక ప్రత్యేక విమానం (chartered aircraft) ద్వారా ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయానికి పయనం అయ్యారు. ఆదివారం ఉదయం ఆమె తాజ్ మహల్‌ను సందర్శించి, ఆ చారిత్రక కట్టడం వద్ద సుమారు గంటన్నర సమయం గడపనున్నారు. మధ్యాహ్నం వేళ, ఆమె ఖేరియా విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో జైసల్మేర్‌కు బయలుదేరతారు. టిఫానీ ట్రంప్ పర్యటన వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, భద్రతాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు , స్థానిక యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.