newsseals.com
News

ఉద్యమ కారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం

VijayaBhaskar June 2, 2026
newsseals-TelanganaGovt
Spread the love

4న జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో 4 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది.

ఈ పార్టీల ప్రతినిధులు 4వ తేదీ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయంలోకి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రవేశించేందుకు వీలుగా ముందస్తుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవీదాస్ (87126 66004 )ని సంప్రదించాలని ఒక అధికారిక ప్రకటనలో కోరింది. ఇదిలా ఉండ‌గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం. ప‌లు పార్టీలు ప్ర‌భుత్వం ఉదాసీన వైఖ‌రి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.