పాల‌నా ప‌రంగా య‌డ్యూర‌ప్ప అనుభ‌వం అవ‌స‌రం

VijayaBhaskar · June 3, 2026
Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నూత‌న సీఎం డీకేఎస్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. బుధ‌వారం నూత‌న ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు క‌ర్నాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా వివిధ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌ను క‌లుసుకున్నారు. వారి ఆశీర్వాదం కూడా పొందారు. డీకే శివ‌కుమార్ ముందుగా మాజీ భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి హెచ్ డి దేవగౌడ నివాసానికి వెళ్లారు. ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రించారు. దేవ‌గౌడ ఆశీర్వాదం అందుకున్నారు. అనంత‌రం నేరుగా మాజీ సీఎం, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు యెడ్యూర‌ప్ప నివాసానికి వెళ్లారు. ఆయ‌న ఇంట్లో ఉన్న పూజ గ‌దికి వెళ్లి పూజ‌లు చేశారు. అనంత‌రం యెడ్డీని ఆలింగ‌నం చేసుకున్నారు.

త‌న‌తో కొద్ది సేపు బేటీ అయ్యారు. ఇవాళ జ‌రిగే సీఎం ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. దీనికి యెడ్యూర‌ప్ప సైతం సంతోషంగా స్వీక‌రించారు. తాను తప్ప‌కుండా వ‌స్తాన‌ని తెలిపారు. మాజీ ముఖ్య‌మంత్రి యెడ్డీతో భేటీ అనంత‌రం నూత‌న ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ మీడియాతో మాట్లాడారు. సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా నిలుస్తాయ‌ని అన్నారు. కర్ణాటక పురోగతి , ప్రజల సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్న తరుణంలో, సీనియర్ నాయకుల అనుభవం , మార్గదర్శకత్వం కోసం తాను ఆస‌క్తితో ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పారు.