కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు

VijayaBhaskar · June 4, 2026
Spread the love

రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీక‌ర‌ణకు ఓకే

న్యూఢిల్లీ : ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది. విమాన‌యాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధ‌ర స్థిరీక‌ర‌ణ నిధికి రూ. 10 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడం దీని లక్ష్యం. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ATF ధరలు 2.5 రెట్లు పెరిగాయి. ATF ధర లీటరుకు ₹60.5 (మార్చి-26 నాటికి) నుండి ₹142 (మే-26 నాటికి)కి పెరిగిందిఅంతే కాకుండా Delhi-NCR కోసం ₹5,041 కోట్లకు ఆమోదం తెలిపింది మంత్రివ‌ర్గం. పాత BS-I నుండి BS-IV శ్రేణి ట్రక్కులు, బస్సుల మార్పిడిని లక్ష్యంగా చేసుకుంది. 1.9 లక్షలకు పైగా ట్రక్కులు ,16,000 బస్సులను ఈ పథకం పరిధిలోకి తెస్తుంది.

BS-VI మరియు విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుకు కూడా కేబినెట్ ప్ర‌యారిటీ ఇచ్చింది. తెలంగాణలో రహదారుల నిర్మాణం చేప‌ట్టేందుకు రూ. 7,597 కోట్ల‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా జాతీయ ర‌హ‌దారుల 4 లేన్ల విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నుంది. బీహార్ లో ర‌హ‌దారుల కోసం రూ. 8,936 కోట్లు, ఒడిశా తీర ప్రాంత ర‌హ‌దారి కోసం రూ. 8,301 కోట్లకు ఆమోదించింది కేబినెట్. మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం కోసం రూ. 4,415 కోట్ల‌కు ఓకే చెప్పింది. ర‌హ‌దారి ప్రాజెక్టుల కోసం రూ. 29,000 కోట్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.