newsseals.com
SPORTS

హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు..?

VijayaBhaskar June 8, 2026
newsseals-ShadagopanRamesh
Spread the love

బీసీసీఐ సెలెక్టర్లపై రమేష్ ఘాటు కామెంట్స్

చెన్నై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ టి20 జ‌ట్టు తాజా ఎంపిక‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు మాజీ క్రికెట‌ర్ శ‌ట‌గోప‌న్ ర‌మేష్. సోష‌ల్ మీడియా వేదిక‌గా నిప్పులు చెరిగారు. ఏ ప్రాతిప‌దిక‌న ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశారో చెప్పాల‌న్నాడు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు జ‌ట్టులో తీసుకున్న హ‌ర్షిత్ రాణా గురించి. త‌న‌ను ఎలా ఎంపిక చేశారని, ఏ ప్రాతిప‌దిక‌న సెలెక్టు చేశారో చెప్పి తీరాలన్నాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతను దేశవాళీ క్రికెట్ ఆడాడని నాకు అనిపించడం లేదన్నాడు.

దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. ఇప్పుడు షమీ లేదా మిగిలిన వారి మనసులో ఏముంటుందో ఒక్కసారి ఊహించు కోవాల‌ని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ అయినా లేదా రోహిత్ శర్మ అయినా సరే, ఎంపిక పరిశీలనలో ఉండాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పింది. హార్దిక్ పాండ్యా గాయపడినప్పుడు కూడా, ఎంపిక కోసం అతను తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి వచ్చింది. షమీ విషయంలో అయితే, గాయం తర్వాత అతను ఎక్కువ సేపు బౌలింగ్ చేయగలడా అని ప్రశ్నించారు .