స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయం త‌గ‌దు

VijayaBhaskar · June 11, 2026
Spread the love

మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్

విశాఖ‌పట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ దుర్ఘ‌ట‌నలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వ‌హించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలోనూ రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన క్ష‌ణం నుంచి కూట‌మి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచింద‌ని చెప్పారు.

కేంద్ర మంత్రులు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున, శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ప్రకటించాం అన్నారు.. మృతుల కుటుంబాలకు ఉద్యోగం, పిల్లలకు విద్య, క్వార్టర్స్ సౌకర్యం కల్పిస్తాం అని చెప్పారు కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్. ఇలాంటి విషాదంలోనూ రాజకీయాలు చేయడం జగన్‌కే సాధ్యం అంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్‌లో వేల ఉద్యోగాలు పోయాయని అబద్ధాలు చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు.