newsseals.com

జగన్ రప్పా రప్పా క్రెడిట్ మాకొద్దు

July 5, 2026 · VijayaBhaskar

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో ప‌ర్య‌టించారు. తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు సమర్థ‌ నాయకత్వంలో రైజింగ్ రాయలసీమ ఆవిర్భవిస్తోందని మంత్రి తెలిపారు. రూ.16,350 కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటవుతోందని, ఈ పరిశ్రమతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని చెప్పారు. ఇప్పటికే రాయలసీమను డ్రోన్ హబ్ గా, పారిశ్రామిక హబ్, టూరిజం హబ్ గా, హార్టీకల్చర్ హబ్ గా రూపొందించేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. యుద్ధ విమానాలు, రాయల్ ఇన్ ఫీల్డ్ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు ఎస్. స‌విత .

రాయలసీమను అన్నివిధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. . స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తమ ఘనతేనని జగన్ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 2018లోనే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారన్నారు. జగన్ క్రెడిడ్ అంతా రప్పా రప్పా నరకడం, విధ్వంసమేనన్నారు. తమ ప్రభుత్వానిది అభివృద్ది క్రెడిట్ అన్నారు. జగన్ రప్పా రప్పా క్రెడిట్ తమకు అవసరం లేదన్నారు. అమరావతికి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళతామంటున్న జగన్ ను 2024 ఎన్నికల్లోనే ప్రజలు ఓడించి తగిన గుణపాఠం చెప్పారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.

Related News