newsseals.com

24న రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లికి వంద‌నం : నారా లోకేష్

July 23, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమం, అభివృద్ది ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. ఇవాళ లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుస్థిర‌మైన డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఇక్క‌డ కొలువు తీర‌డంతో ఏపీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, ఆక్వా, త‌దిత‌ర రంగాల‌కు ఏపీని కేరాఫ్ గా మారుస్తామ‌న్నారు. విద్యా రంగానికి విస్తృతంగా మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు నారా లోకేష్. కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకు రావ‌డంతో ఊహించ‌ని రీతోలో స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఈసారి గ‌తంలో కంటే భారీ ఎత్తున పిల్ల‌లు ప్ర‌భుత్వ స్కూల్స్ , కాలేజీల‌లో చేరేందుకు పోటీ ప‌డ్డార‌ని ఇది తాము సాధించిన విజ‌యంగా ఆయ‌న పేర్కొన్నారు.

ఇక పిల్లలే మన సంపద. వారి చదువులే మనకు తరగని ఆస్తి. విద్యే మన రాష్ట్ర వెలకట్టలేని పెట్టుబడి. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది మా కూటమి ప్రభుత్వం లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్. అందుకే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే పథకం తల్లికి వందనం రూపొందించడం జ‌రిగింద‌న్నారు. వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం నిధులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేశామ‌న్నారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లులు 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం అన్నారు. ఈ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు.

24న రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లికి వంద‌నం : నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమం, అభివృద్ది ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. ఇవాళ లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుస్థిర‌మైన డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఇక్క‌డ కొలువు తీర‌డంతో ఏపీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, ఆక్వా, త‌దిత‌ర రంగాల‌కు ఏపీని కేరాఫ్ గా మారుస్తామ‌న్నారు. విద్యా రంగానికి విస్తృతంగా మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు నారా లోకేష్. కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకు రావ‌డంతో ఊహించ‌ని రీతోలో స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఈసారి గ‌తంలో కంటే భారీ ఎత్తున పిల్ల‌లు ప్ర‌భుత్వ స్కూల్స్ , కాలేజీల‌లో చేరేందుకు పోటీ ప‌డ్డార‌ని ఇది తాము సాధించిన విజ‌యంగా ఆయ‌న పేర్కొన్నారు.

ఇక పిల్లలే మన సంపద. వారి చదువులే మనకు తరగని ఆస్తి. విద్యే మన రాష్ట్ర వెలకట్టలేని పెట్టుబడి. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది మా కూటమి ప్రభుత్వం లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్. అందుకే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే పథకం తల్లికి వందనం రూపొందించడం జ‌రిగింద‌న్నారు. వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం నిధులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేశామ‌న్నారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లులు 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం అన్నారు. ఈ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు.

Related News