యార్క్ షైర్ తరపున కుల్దీప్ యాదవ్ ఒప్పందం

ఇంగ్లండ్ : భారత జట్టుకు చెందిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ లోని యార్క్ షైర్ జట్టు తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనను ఇండియా జట్టుకు ఎంపిక చేయక పోవడం తో ఈ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. భారత జట్టు తుది పదకొండు మందిలో స్థానం దక్కించు కోవడంలో పదేపదే విస్మరణకు గురైన లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ప్రస్తుత సీజన్లో ప్రముఖ ఇంగ్లీష్ కౌంటీ జట్టు ‘యార్క్షైర్’ తరపున ఎనిమిది మ్యాచ్లు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత అంతర్జాతీయ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను విదేశీ ఆటగాడిగా జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించడానికి యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ సంతోషిస్తోంది. 31 ఏళ్ల యాదవ్ ఐదు ‘మెట్రో బ్యాంక్ వన్ డే కప్’ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు, ఆ తర్వాత సెప్టెంబర్లో జరిగే చివరి నాలుగు ‘రోత్సే కౌంటీ ఛాంపియన్షిప్’ మ్యాచ్లలో మూడింటి కోసం హెడింగ్లేకు తిరిగి వస్తాడని యార్క్షైర్ CCC తమ వెబ్సైట్లో ప్రకటించింది.
నీత్ (Neath) వేదికగా గ్లామోర్గాన్తో శుక్రవారం జరగనున్న 50 ఓవర్ల మ్యాచ్ కోసం యాదవ్ నేరుగా జట్టులో చేరనున్నాడు. యార్క్షైర్లో చేరడంపై యాదవ్ ఇలా అన్నాడు. యార్క్షైర్లో చేరడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది . ఈ అవకాశం లభించినందుకు కృతజ్ఞుడను. గొప్ప చరిత్ర కలిగిన క్లబ్కు ప్రాతినిధ్యం వహించడం నిజంగా ఒక గౌరవం. ఇంగ్లీష్ పరిస్థితుల్లో ఆడటంలోని సవాలును నేను ఎప్పుడూ ఆస్వాదించాను. యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత, జట్టుతో చేరడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను . హెడింగ్లేలో నా సమయం గడిపేటప్పుడు సానుకూల సహకారం అందించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నాడు కుల్దీప్ యాదవ్.