newsseals.com
News

కావేరీ స‌మ‌స్య‌పై స‌ర్కార్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

VijayaBhaskar August 2, 2026
newsseals-karnataka

బెంగ‌ళూరు : కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధ్యక్షతన ఆదివారం బెంగ‌ళూరులో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో య‌డ్యూర‌ప్ప‌, వీర‌ప్ప మొయిలీ, మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, బ‌స‌వ‌రాజ్ బొమ్మైతో పాటు ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఈ కావేరీ నీటి వివాదం ఇప్ప‌టి నుంచి లేద‌ని, గ‌త కొన్ని త‌రాల నుండి కొన‌సాగుతూ వ‌స్తున్న‌ద‌ని పేర్కొన్నారు ఈ సంద‌ర్బంగా సీఎం డీకే శివ‌కుమార్.

నేల, నీరు, భాషకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా నిలవడం కర్ణాటక రాజకీయ సంప్రదాయం అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు . గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అనేకసార్లు ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయని కూడా అన్నారు. ఆ సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలు అండగా నిలిచాయ‌ని పేర్కొన్నారు సీఎం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక సూచనలు చేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయని నాకు నమ్మకం ఉందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.