ఓనం ఫెస్టివల్ కోసం 112 స్పెషల్ ట్రైన్స్

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సంచలన ప్రకటన చేసింది. కేరళ ప్రజలకు తీపి కబురు చెప్పింది. త్వరలో రాష్ట్రంలో ఓనం పండుగ రానుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు గాను అదనంగా 112 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు ప్రకటించింది.ఇదిలా ఉండగా 2025లో పండుగ సమయంలో 55 ప్రత్యేక సర్వీసులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్య 112కు పెరిగింది .ఓనం పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది; ఇందులో సదరన్ రైల్వే 54 సర్వీసులను, ఇతర జోనల్ రైల్వేలు మిగిలిన 58 సర్వీసులను నిర్వహిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 6 మధ్య నడుస్తాయి కేరళను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , పశ్చిమ బెంగాల్లోని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తాయి. సదరన్ రైల్వే తన నెట్వర్క్ పరిధిలో 38 ప్రత్యేక సర్వీసులను పొరుగు రైల్వే జోన్లతో కేరళను అనుసంధానిస్తూ 16 అంతర్-రైల్వే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది.
సౌత్ వెస్ట్రన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే , సౌత్ ఈస్టర్న్ రైల్వేలు కలిసి కేరళకు, కేరళ మీదుగా 58 అదనపు ప్రత్యేక సర్వీసులను నడుపుతాయి. ఈ ఏడాది ఓనం సీజన్ కోసం రైల్వే ప్రత్యేక రైలు సర్వీసుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది. 2025లో పండుగ సమయంలో 55 ప్రత్యేక సర్వీసులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్య 112కు పెరిగిందని, ఇది సుమారు 103 శాతం పెరుగుదలపేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు చెన్నై, బెంగళూరు, మైసూరు, హుబ్బళ్లి, హైదరాబాద్ , సంత్రగాచి వంటి ప్రధాన నగరాలను తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, కన్నూర్, ఎర్నాకులం , మంగళూరు వంటి కేరళలోని ముఖ్య ప్రాంతాలతో అనుసంధానిస్తాయి. పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే వేలాది మంది ప్రవాస కేరళీయులు, విద్యార్థులు, ఉద్యోగులు , పర్యాటకులకు ఈ సేవలు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తోంది రైల్వే శాఖ.