భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఆభరణం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. ఈ సందర్బంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక ఆభరణంలా (హారంగా) నిలుస్తుందని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆ ప్రాంత పరిస్థితులను సమూలంగా మారుస్తుందని, ఆగస్టు 1న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిని ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.
విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ , అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విమానయాన శాఖ అధికారులు, విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ (GMR) సంస్థ ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.