newsseals.com
News

తెలంగాణ కోరుకున్న‌ది నియంతృత్వం కాదు

Posted by: VijayaBhaskar August 7, 2026
newsseals-EatalaRajender

హైద‌రాబాద్ : ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ స‌మాజం ఏనాడూ నియంతృత్వంను కోరుకోలేద‌న్నారు. స్వీయ అస్తిత్వం, ఆత్మ గౌర‌వానికి ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు. దీనిని అర్థం చేసుకోక పోతే నాయ‌కుల‌కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. జ‌య‌శంక‌ర్ సారు కోరుకున్న‌ది ఒకరినొకరు గౌరవించుకొనే అందరికీ సమాన ప్రాతినిధ్యం దక్కే తెలంగాణ అని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నది స్టాల్ చేయడానికి కానీ బారసాల ఫంక్షన్ లో అటెండ్ కావడానికి కాదన్నారు. వారిని ఆ స్థాయికి తీసుకు రావద్దన్నారు ఎంపీ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ లో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి , తెలంగాణ విద్యామండలి సభ్యులు ప్రొఫెసర్. విశ్వేశ్వర రావు తో కలిసి పాల్గొన్నారు.

జయశంకర్ సార్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేన‌ని పేర్కొన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఉద్యమ సమయంలో వేల వేల గంటలు ఆయనతో ఉన్నామ‌ని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన స్పూర్తి, చెప్పిన పాఠాలు మమ్ముల్ని నడిపించాయని చెప్పారు. తెలవని అజ్ఞానులు తెలంగాణ ఉద్యమం మొన్నీమధ్యదే, ఇప్పుడే త్యాగాలు చేశారు అనుకుంటున్నారు. ఇది మూడు తరాల ఉద్యమం అని మర్చి పోతున్నార‌ని అన్నారు. 1952 నాన్ ముల్కీ, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం. 1969 లో 369 మంది బలిదానాలు చేశారని ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు ఎంపీ. సిటీ కాలేజీ దగ్గర జరిగిన ఉద్యమంలో నలుగురు విద్యార్థులు బలి అయ్యారని ఆవేద‌న చెందారు. ఆరోజు నేను ఎక్కిన బస్ కరాబ్ కాకపోతే.. ఆ కాల్పుల్లో నేను అమరుణ్ణి అయి ఉంటే.. ఇంత దుఃఖం చూసే దౌర్భాగ్యం తప్పేది అని అనేక సార్లు చెప్పేవారని చెప్పారు .