newsseals.com
News

పాకిస్తాన్ జ‌ర జాగ్ర‌త్త భార‌త్ హెచ్చ‌రిక‌

VijayaBhaskar October 3, 2025
newsseals-indianarmychief
Spread the love

నిప్పులు చెరిగిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తోక జాడిస్తే తాట తీస్తామ‌న్నారు. ఇప్ప‌టికే ఇండియా స‌త్తా ఏమిటో ఆప‌రేష‌న్ సిందూర్ తో తేలి పోయింద‌న్నారు. కాళ్ల బేరానికి రావ‌డం వ‌ల్ల‌నే తాము కనిక‌రించామ‌ని లేకపోయి ఉంటే పాకిస్తాన్ ఇవాళ లేకుండా పోయి ఉండేద‌న్నారు. జ‌న‌ర‌ల్ ద్వివేది శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో. భవిష్యత్తులో జరిగే ఘర్షణల్లో భారత్ సంయమనం పాటించదని అన్నారు, సైనికులు సిద్ధంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదంపై పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్ సైనిక చర్యకు భారతదేశం సంసిద్ధతను నొక్కి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.

ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపు కోవాలనుకుంటే పొరుగు దేశం తన గడ్డపై ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం మానేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ప‌ష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో న్యూఢిల్లీ చూపిన సంయమనం భవిష్యత్తులో సైనిక వివాదం సంభవించినప్పుడు పునరావృతం కాదని అన్నారు. భారత సైనికులు చర్యకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతదేశం అన్నింటికి సిద్దంగా ఉంద‌న్నారు. ఈసారి ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో చూపిన సంయమనాన్ని అది ప్రదర్శించదని పేర్కొన్నారు. ఈసారి మనం ఒక అడుగు ముందుకు వేసి, పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటున్నారా లేదా అని ఆలోచించేలా వ్యవహరిస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలోని అనుప్‌గఢ్‌లో సైనికులను ఉద్దేశించి కఠినంగా ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని భారతదేశం ప్రపంచానికి రుజువు ఇచ్చిందని జనరల్ ద్వివేది అన్నారు. భారతదేశం ఈ ఆధారాలను వెలికి తీయకపోతే, పాకిస్తాన్ వాటన్నింటినీ దాచిపెట్టి ఉండేదని ఆయన అన్నారు.