newsseals.com
News

భార‌త్ ఇట‌లీ మ‌ధ్య బంధం బలీయ‌మైన‌ది

VijayaBhaskar May 20, 2026
newsseals-PMModi
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ

ఇట‌లీ : భారత్ ఇట‌లీ దేశాల మ‌ధ్య బంధం అత్యంత బ‌లీయ‌మైన‌ద‌ని అన్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇటలీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా బుధ‌వారం మోదీ ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి మెలోనీతో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆయ‌న అడుగు పెట్టిన వెంట‌నే మెలోనితో విందులో పాల్గొనే అవకాశం లభించింది.. ఆ తర్వాత ప్రఖ్యాత కొలోసియంను సందర్శించారు. అనేక విస్తృత అంశాలపై త‌మ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. భారతదేశం-ఇటలీ మైత్రిని మరింత బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై త‌మ‌ సంభాషణను కొనసాగించారు. చర్చలు అత్యంత ఫ‌ల‌ప్ర‌దంగా జ‌రిగిన‌ట్లు చెప్పారు ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

ఇద్దరూ విందులో పాల్గొన్నారు, అనంతరం కొలోస్సియంను సందర్శించారు, అక్కడ వారు పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు నాయకులు తమ పర్యటనకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు, ఇది వారి సమావేశం గురించి ఒక అవగాహనను తెలియ చేస్తుంది. ఇదిలా ఉండ‌గా మెలోనీ రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా ఇటలీ, భారతదేశ జాతీయ జెండాలను సూచించే రెండు ఎమోటికాన్‌లను జతచేశారు.