newsseals.com
News

త‌ర త‌రాల‌కు త‌ర‌గ‌ని స్పూర్తి ఎన్టీఆర్

VijayaBhaskar May 28, 2026
newsseals-NaraLokesh
Spread the love

ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు

అమ‌రావ‌తి : తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కు దివంగ‌త , ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌తికే ఉంటాడ‌ని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మే 28న ఎన్టీఆర్ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌నను స్మ‌రించుకున్నారు. ఘ‌నంగా నివాళులు అర్పించారు.ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన‌ విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని సేవ‌లు స్మ‌రిస్తూ నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు లోకేష్‌.

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వంగా తెలుగుదేశం పార్టీ ప‌తాకాన్ని ఎగుర వేశారని కొనియాడారు. అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా ప‌సుపు జెండాని నిల‌బెట్టార‌ని అన్నారు. మ‌హిళా సాధికార‌త‌కు బాట‌లు వేశారు. ప్ర‌జ‌ల కోసం..ప్ర‌గ‌తి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృద‌యాల్లో కొలువైన మ‌ర‌ణంలేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్‌కు జోహార్లు. తాతా..మీరే తెలుగు ప్ర‌జ‌ల కీర్తి..మీరే మాకు నిత్య‌నూత‌న స్ఫూర్తి అని పేర్కొన్నారు నారా లోకేష్‌.