newsseals.com
News

బొద్దింక‌ల జ‌నతా పార్టీ నిర‌స‌న కేంద్రంపై ఆందోళ‌న

VijayaBhaskar June 6, 2026
newssealss-CJPProtest
Spread the love

సీజేపీ అధ్య‌క్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సార‌థ్యంలోని బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ (సీజేపీ) శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జాస్వామిక వాదులు, స్వ‌చ్చంద సేవ‌కులు, పౌర స‌మాజం, పౌర హ‌క్కుల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇందులో స్వ‌చ్చంధంగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా సీజేపీ నేత‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు , ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏం సాధిస్తారని ప్రజలు అడుగుతుంటారని అన్నారు. అవి మనం సజీవంగా ఉన్నామని నిరూపిస్తాయని పేర్కొన్నారు . ప్రభుత్వ దృష్టిలో మనం కేవలం పురుగులమంత అల్పమైన వారమే కావచ్చు, కానీ మనం ఇంకా ఉనికి కోల్పోలేద‌ని సజీవంగా ఉన్నాం అని తెలియ చేస్తుంద‌న్నారు. అంతే కాదు మన హక్కుల కోసం పోరాడగల సామర్థ్యం మనకు ఉంద‌ని ప్ర‌క‌టించేందుకు ఇది వీలు క‌ల్పిస్తుంద‌న్నారు సీజేపీ చీఫ్‌.