జమ్మూలో దిల్జిత్ దోసాంజ్ ‘సట్లూజ్’ ప్రదర్శన

జమ్మూ కాశ్మీర్ : తీవ్ర వివాదానికి దారి తీసిన చిత్రం సట్లూజ్. ఇందులో పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ కీ రోల్ పోషించాడు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదలైన 48 గంటల్లోనే OTT ప్లాట్ఫారమ్ ZEE5 నుండి తొలగించబడిన ‘సట్లూజ్’ చిత్రాన్ని జమ్మూలోని నానక్ నగర్లో ఉన్న గురుద్వారా శ్రీ గురు నానక్ దేవ్ జీలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను జమ్మూలోని డిస్ట్రిక్ట్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ (DGPC) నిర్వహించింది. ఈ చిత్రాన్ని కలిసి చూసేందుకు వివిధ వర్గాల ప్రజలు హాజరయ్యారు. కోశాధికారి సర్దార్ జగ్పాల్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలు ఈ చిత్రాన్ని చూడటానికి చూపిన ఆసక్తికి భారీ సంఖ్యలో హాజరైన జనం నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇతర గురుద్వారాల్లో కూడా ప్రదర్శనలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఇక్కడ గుమిగూడిన వారిని చూడండి; హిందువులు, సిక్కులు, ముస్లింలు, ఇతర మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. సినిమా రాత్రి 8:00 గంటలకు ప్రారంభమైంది, ఇప్పుడు దాదాపు 10:20 అవుతోంది. ప్రభుత్వం లేదా దీనికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు నిజాన్ని దాచాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా ప్రస్తుతం ఈ గురుద్వారాలో ప్రదర్శించ బడుతోంది. 16వ తేదీ వరకు వివిధ గురుద్వారాల్లో ప్రదర్శనలు కొనసాగుతాయి అని ఆయన పేర్కొన్నారు. దిల్జిత్ దోసాంజ్ నటించిన ఈ చిత్రం, విడుదలైన రెండు రోజులకే ZEE5 నుండి తొలగించ బడటంతో వార్తల్లో నిలిచింది; ఈ ఘటనపై పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు.