మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ త‌గ‌దు

మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్

విశాఖ‌ప‌ట్నం : మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ తాము తీసుకు వ‌చ్చి , అభివృద్ది చేసిన వైద్య కాలేజీల‌ను ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. దీనిని తాము అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం పేద ప్రజల ఆరోగ్యానికి దెబ్బ త‌గులుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
అంత‌కు ముందు వైయస్‌ఆర్‌సిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు , మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించారు. సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

పిపిపి మోడల్ కింద 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే చర్యను పేదలకు ద్రోహం చేసినట్లుగా అభివర్ణించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఇది పేద విద్యార్థుల నుండి ఉచిత వైద్య విద్యను లాక్కుంటుందని, పేదలకు సరసమైన ఆరోగ్య సంరక్షణను దూరం చేస్తుంద‌ని, దీనిని త‌ప్ప‌కుండా వ్య‌తిరేకిస్తామ‌ని హెచ్చరించారు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 18 కొత్త ప్రభుత్వ కళాశాలలకు రూ. 8,500 కోట్లు మంజూరు చేశారని, ఐదు ఇప్పటికే పని చేస్తున్నాయ‌ని చెప్పారు గుడివాడ అమ‌ర్ నాథ్. 750 అదనపు ఎంబిబిఎస్ సీట్లను సృష్టించారని ఆయన గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా, ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఎందుకు స్థాపించ లేక పోయారని ప్ర‌శ్నించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *