మోక్ష‌గుండం భార‌త దేశానికి ఆద‌ర్శ‌ప్రాయం

విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి..నేడే ఇంజ‌నీర్స్ డే

హైద‌రాబాద్ : ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ 15న ఇంజ‌నీర్స్ డే నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. దీని వెనుక బ‌ల‌మైన క‌థ ఉంది. అంత‌కు మించిన చ‌రిత్ర ఉంది. ప‌లు ప్రాజెక్టుల‌కు ప్రాణం పోసిన భార‌తీయ ఇంజ‌నీర్. త‌ను మోడ‌ల్ ఇంజ‌నీర్ గా పేరు పొందాడు. కృష్ణ రాజ సాగర సరస్సు ఆనకట్ట నిర్మాణంలో కీల‌క భూమిక పోషించారు. ఆయ‌న పుట్టిన రోజునే ఇంజ‌నీర్స్ దినోత్స‌వంగా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.
కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముద్దెనహళ్లి గ్రామంలో పుట్టారు. 15 సంవత్సరాల వయసులో త‌ను తండ్రిని కోల్పోయాడు. 1881లో బెంగళూరులోని సెంట్రల్ కాలేజీ నుండి బి.ఎ. డిగ్రీ పొందాడు. ఆర్థిక సహాయంతో, అతను పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరాడు . సివిల్ ఇంజనీరింగ్‌లో లైసెన్సియేట్ పొందాడు. 1883లో ఎల్సీఈ, ఎఫ్‌సీఈ ప‌రీక్ష‌ల‌లో మొద‌టి ర్యాంకు పొందాడు విశ్వేశ్వ‌ర‌య్య‌.

బొంబాయి ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియమించింది. నాసిక్, ఖండేష్, పూణేలలో ప్రాజెక్టులను అమలు చేశాడు. ఆ తర్వాత అతను ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లో ఉద్యోగం చేపట్టి దక్కన్ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను సృష్టించడంలో సహాయం చేశాడు. 1895లో సుక్కూర్ మునిసిపాలిటీ కోసం వాటర్‌వర్క్‌లను కూడా రూపొందించాడు. 1906-07లో ప్రభుత్వం అతన్ని ఆడెన్‌లో నీటి సరఫరా మరియు డ్రైనేజీ వ్యవస్థను అధ్యయనం చేయడానికి పంపింది, అక్కడ ఒక ప్రాజెక్ట్‌ను రూపొందించి అమలు చేశాడు. సముద్రపు నీటి నుండి విశాఖపట్నం ఓడరేవు కోతకు గురైన సమస్యను పరిష్కరించడానికి ప‌రిష్కారం చూపించాడు.

1900లలో హైదరాబాద్ నగరం పదే పదే వరదలను ఎదుర్కొంది. ప్రత్యేక కన్సల్టింగ్ ఇంజనీర్ హోదాలో, సమస్యను పరిష్కరించడంలో సహాయ పడటానికి నగరంలో ఇంజనీరింగ్ పనులను పర్యవేక్షించాడు. హైదరాబాద్ కోసం వరద రక్షణ వ్యవస్థను రూపొందించారు. ఆయ‌న చ‌ల‌వ వ‌ల్ల‌నే ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ ప్రాజెక్టులు పూర్త‌య్యాయి. ఆయ‌న వ‌ల్ల‌నే న‌గ‌ర వాసులు హాయిగా బ‌తుకుతున్నారు. ఇవాళ ఆ మ‌హానుభావుడి జ‌యంతి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *