ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు దామోద‌ర్ రెడ్డి పేరు

ప్ర‌క‌టించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

సూర్యాపేట జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 ప్రాజెక్టుకు దివంగ‌త మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి పేరు పెడ‌తామ‌న్నారు. ఆదివారం ఇటీవ‌లే మ‌ర‌ణించిన రాంరెడ్డి ద‌శ‌దిన ఖ‌ర్మ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన సంతాప స‌భ‌లో ప్ర‌సంగించారు రేవంత్ రెడ్డి. రాంరెడ్డి సోద‌రులు ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేశార‌న్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నార‌ని కొనియాడారు సీఎం.
దామోద‌ర్ రెడ్డి మరణం పార్టీకి, తెలంగాణకు తీర‌ని న‌ష్టం అన్నారు.

తన జీవితాంతం ప్రజలు, పార్టీ కోసం జీవించారని, పార్టీ కార్యకర్తల సంక్షేమం, సంస్థ కోసం తన వ్యక్తిగత సంపద‌, సౌకర్యాలను త్యాగం చేశారని అన్నారు. ప్రజా ప్రతినిధులు అయిన తర్వాత చాలా మంది ఆస్తులను కూడబెట్టుకుంటే, దామోదర్ రెడ్డి నిస్వార్థతకు ఉదాహరణగా నిలిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేసిన ఆయన, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాల పూర్వీకుల భూమిని ప్రజా సేవ కోసం త్యాగం చేశారంటూ ప్ర‌శంస‌లు కురిపించారు ఎ. రేవంత్ రెడ్డి.

రాజకీయ వేధింపుల సమయంలో దామోదర్ రెడ్డి పార్టీ క్యాడర్‌కు ఎల్లప్పుడూ అండగా నిలిచారని, నల్గొండ జిల్లాలో పార్టీ జెండాను కాపాడుకున్నారని సీఎం గుర్తు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP) ద్వారా నల్గొండలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకు రావడానికి ఆయన అవిశ్రాంతంగా పోరాడారని అన్నారు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి SRSP స్టేజ్-II పనులను ప్రారంభించేలా చూశార‌ని చెప్పారు. రాజకీయాల్లో ఆయనకు ‘టైగర్ దమ్మన్న’ బిరుదును తెచ్చిపెట్టేలా చేసింద‌న్నారు. అందుకే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ప్రాజెక్టుకు రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *