18న తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ : కృష్ణ‌య్య‌

బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామ‌ని వార్నింగ్

హైద‌రాబాద్ : ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వ‌హిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు బీసీ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ఆర్. కృష్ణ‌య్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ . గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలంటే రాష్ట్రంలో భ‌య‌ప‌డే స్థితికి తీసుకు వ‌స్తామ‌న్నారు. త‌మ‌కు ప‌ద‌వుల కంటే రిజ‌ర్వేష‌న్లు ముఖ్య‌మ‌న్నారు. బీసీల‌ను కోర్టులు నిట్ట నిలువునా ముంచాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు . ఆరు నూరైనా ఎవ‌రు అడ్డుకున్నా బీసీ బంద్ జ‌రిగి తీరుతుంద‌న్నారు. ఈ బంద్ లో అన్ని కులాల వారంతా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. ఒక్క మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బ‌స్సులు తిప్పితే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు.

ప్రజలు ఆవేశంగా ఉన్నారని, బస్సులు తిరిగితే తగులపెట్టే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇదిలా ఉండ‌గా తాము ఈనెల 18న త‌ల‌పెట్టిన బంద్ కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. న్యాయం చెప్పాల్సిన సుప్రీంకోర్టులో అన్యాయం జరిగిందన్నారు.న్యాయ వ్యవస్థలో దారులు మూసుకు పోయాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణ‌య్య‌, జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తే తప్ప బీసీ రిజర్వషన్ల అమలు సాధ్యం కాదని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *