స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సీఎం ఆరా

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న

అమ‌రావ‌తి : ఏపీని వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండ‌డంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌నే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం అత్య‌వ‌స స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కీల‌క స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌, వంగ‌ల‌పూడి అనిత‌, నిమ్మ‌ల రామానాయుడుతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు సైతం హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. ఎక్క‌డా నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ వ‌ద్ద‌ని సూచించారు.

ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మ‌రో వైపు స‌ర్కార్ ముందు జాగ్ర‌త్త‌గా పెద్ద ఎత్తున నిధుల‌ను మంజూరు చేశామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.
ఉమ్మడి విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. ఎక్క‌డా ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చూడాల‌ని, ఆహారం, నీళ్లు, తదిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచించారు సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *