రిమ్స్ ఆస్ప‌త్రిలో వ‌స‌తులు క‌రువు : క‌విత

ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఎమ్మెల్సీ

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రిమ్స్ ఆస్ప‌త్రిని సందర్శించారు. అక్క‌డ క‌నీస వ‌స‌తులు లేక పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీనిపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అక్క‌డ ప‌ని చేస్తున్న డాక్ట‌ర్లు, ఇత‌ర సిబ్బందితో మాట్లాడారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు .

ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోగులు, వైద్యులు, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత, పారిశుధ్యం, వైద్య సిబ్బంది ,ప్రాథమిక సౌకర్యాలకు తక్షణ శ్రద్ధ అవసరమని తన ప‌రిశీల‌న‌లో తేలింద‌ని చెప్పారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ జిల్లాలో గుండెపోటు కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నందున, తక్ష‌ణ‌మే కార్డియాలజిస్ట్‌ను నియమించాలని ఆమె కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కోరారు.

నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. త‌క్ష‌ణ‌మే క‌నీస వ‌స‌తి సౌక‌ర్యాల‌పై దృష్టి సారించాల‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *