ఏపీలో రీన్యూ కంపెనీ రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డి

సీఎం చంద్రబాబు సమ‌క్షంలో కీల‌క ఒప్పందం

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ స‌ర్కార్ దూకుడు పెంచింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు 2025 విశాఖ న‌గ‌రం వేదిక‌గా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం పెద్ద ఎత్తున కంపెనీల‌తో కీల‌క‌మైన ఒప్పందాల‌ను చేసుకుంది కూట‌మి ప్ర‌భుత్వం. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో మంత్రి నారా లోకేష్ , రీ న్యూ కంపెనీ చైర్మ‌న్ , చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ సుమంత్ సిన్హా ఆధ్వ‌ర్యంలో రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డుల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు ప్ర‌ధాన ప్రాజెక్టులు చేప‌ట్ట‌నున్నారు.

ఇది మే 2025 లో రీ న్యూ ఇప్పటికే చేసిన ₹22,000 కోట్లపై నిర్మించ బడింది. ఈ పెట్టుబడులలో 6GW సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ సౌకర్యం, 300KTPA గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, 2GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ , 5GW పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. ఈ చొరవలు క్లీన్ ఎనర్జీ పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని ముందుకు తీసుకు వెళతాయి. రాష్ట్ర నైపుణ్యం కలిగిన యువతకు గణనీయమైన అవకాశాలను సృష్టిస్తాయని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇక సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *