డిసెంబ‌ర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్

ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : పెట్టుబ‌డుల‌ను సాధించ‌డంలో ఓ వైపు ఏపీ స‌ర్కార్ టాప్ లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే విశాఖ వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ స‌ర్కార్ కూడా సిద్ద‌మైంది స‌మ్మిట్ ను నిర్వహించేందుకు . ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆయా విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్బంగా దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ లో నిర్వహించబోయే Telanaga Rising Global Summit- 2025 పై పూర్తిగా దృష్టి సారించాల‌ని ఆదేశించారు. డిసెంబర్ 9 న Telanga Rising-2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది తెలంగాణ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ కానుంద‌న్నారు. ఈ డాక్యూమెంట్ దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఒక మార్గదర్శక పత్రంలా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. శాఖల వారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్ లో ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం. ఈ గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్ల పై సమీక్షలో చర్చించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *