కేసీఆర్ బయటకు వస్తే వేరేలా ఉంటుంది

షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ క‌విత

మెద‌క్ జిల్లా : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి చుల‌క‌న చేస్తూ కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వ్య‌క్తుల‌ను టార్గెట్ చేయ‌డం, వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ‌డితే ప్ర‌జ‌లు ఊరుకోర‌న్నారు. రాద‌నుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయ‌కుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. శ‌నివారం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నార‌ని, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌లో వాస్త‌వం లేద‌న్నారు.

పొద్ద‌స్త‌మానం త‌న తండ్రిని, త‌మ కుటుంబాన్ని దెప్పి పొడ‌వ‌డం, కామెంట్స్ చేయ‌డం అల‌వాటుగా మారిందంటూ మండిప‌డ్డారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఆయ‌న గ‌నుక బ‌య‌ట‌కు వ‌స్తే ప‌రిస్థితి వేరేలా ఉంటుంద‌న్నారు. ఆయ‌న సింహం లాంటోడ‌ని, త‌న‌ను క‌వ్వించాల‌ని చూస్తే త‌ట్టుకోవ‌డం కష్ట‌మ‌న్నారు. ఇక‌నుంచైనా పాల‌నా ప‌రంగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం క‌విత ప‌ర్య‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *