సీఎంతో విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ భేటీ

డిసెంబర్ లో జ‌రిగే రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్ కు రావాలి

హైద‌రాబాద్ : విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైద‌రాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప‌లు అంశాల‌పై ఇరువురు చ‌ర్చించారు. త‌మ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైద‌ని, వెంట‌నే ఇన్వెస్ట్ చేయాల‌ని సీఎం త‌న‌ను కోరారు. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ,బ్యాటరీ నిల్వ, పునరుత్పాదక శక్తి , భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను పరిశీలిస్తుందని తెలిపారు సీఎం. డిసెంబర్ 8–9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనమని రాష్ట్రం తరపున ఫామ్ సాన్ చౌ, విన్‌గ్రూప్ చైర్మన్ శ్రీ ఫామ్ నాట్ వుయాంగ్‌లకు అధికారిక ఆహ్వానాన్ని అందించిన‌ట్లు తెలిపారు రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా త‌మ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌న్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే తెలంగాణ రైజింగ్ లో ఉంద‌ని, దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెప్పారు సీఎం. ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, త‌దిత‌ర రంగాల‌లో హైద‌రాబాద్ వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపు పొందింద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టే వారికి తాము ఎర్ర తివాచీ ప‌రుస్తామ‌న్నారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *