బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షించండి

సీపీకి మ‌హిళా జ‌ర్న‌లిస్టుల ఫిర్యాదు

హైద‌రాబాద్ : త‌మ‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర‌మైన వేధింపుల‌కు పాల్పడుతున్నారంటూ మ‌హిళా జ‌ర్న‌లిస్టులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం తాము కూడా ఈ దేశ పౌరుల‌మేన‌ని, త‌మ‌కు కూడా వాక్ స్వ‌తంత్రం ఉంటుంద‌ని, ప్రాథ‌మ‌క హ‌క్కులు కూడా ఉంటాయ‌ని పేర్కొన్నారు. నానా దుర్భాష లాడుతున్నార‌ని, అడ్డ‌మైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేద‌న చెందారు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు. ట్రోలింగ్‌ భయం కలిగించడం, తమ వృత్తిపరమైన పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.

విద్వేషపూరిత, మతపరమైన ఉద్రిక్తత కలిగించే కంటెంట్‌ను కూడా ఈ హ్యాండిల్లు విస్తృతంగా పోస్ట్ చేస్తున్నాయని తెలిపారు. సంబంధిత హ్యాండిల్లు, వ్యక్తులపై దర్యాప్తు చేసి, ఐపీసీ, ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఆన్‌లైన్‌–భౌతిక రక్షణను కల్పించాలని విన్న‌వించారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ను. ఈ వేధింపులు మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమేనని, మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని చెప్పారు . హైదరాబాద్‌ సిటీ పోలీసులు సమర్పించిన సమాచారాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *