విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి

అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, అది బ‌తుకు దెరువు చూపించ‌డ‌మే కాకుండా స‌మాజంలో మ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేస్తుందని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి.
ద్రావిడ యూనివర్సిటీలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నారా భువనేశ్వరి . అనంతరం ద్రావిడ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం ఇచ్చారు.

భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. సాధించాల‌న్న ప‌ట్టుద‌ల ఉంటే ఎంత‌టి క‌ష్ట‌మైనా సుల‌భంగా మారి పోతుంద‌న్నారు. కృషి లేకుండా విజ‌యం సాధ్యం కాద‌ని తెలుసుకుంటే మంచిద‌న్నారు. ఇవాళ టెక్నాల‌జీ ఎంతో మారి పోయిందని, దానిని స‌రైన స‌మ‌యంలో గుర్తించి ప‌ట్టు పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తే మీ చెంత‌కే జాబ్స్ వ‌స్తాయని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి. త‌న భ‌ర్తకు 75 ఏళ్లు దాటినా నేటికీ ఆయ‌న 18 గంట‌ల‌కు పైగా క‌ష్ట ప‌డ‌తార‌ని , మ‌న కృషినే మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని, అదే మ‌న‌కు గుర్తింపును తీసుకు వ‌చ్చేలా చేస్తుంద‌న్నారు. శ్ర‌మనే ఆయుధం, అదే మ‌న‌కు బ‌లం అని, దానిని న‌మ్ముకుని ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *