స‌న్న బియ్యం పంపిణీ ప్ర‌శంస‌నీయం : జోషి

తెలంగాణ స‌ర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు

హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల‌కు స‌న్న బియ్యం పంపిణీ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి . ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని, పౌర స‌ర‌ఫ‌రాలు, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌ను అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రికి తెలియ చేశారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి. దేశ వ్యాప్తంగా పేద‌ల‌కు ఆయా రాష్ట్రాల‌లో ఇదే ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడాల‌ని కోరారు.

ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీల‌క‌మైన సూచ‌న‌కు సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి. మంచి ప‌థ‌క‌మ‌ని, దీని వ‌ల్ల పేద‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లోనే తాను ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడుతాన‌ని, ఢిల్లీలో ఇందుకు సంబంధించి కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి సాధ్యా సాధ్యాల‌ను కూడా ప‌రిశీలిస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *