29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివ‌స్

నిర్వ‌హంచాల‌ని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన ఆనాటి తెలంగాణ వ‌చ్చుడో కేసీఆర్ స‌చ్చుడో పిలుపు వ‌ల్ల‌నే నూత‌న రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు. అందుకే ప్ర‌తి ఏటా న‌వంబ‌ర్ 29వ తేదీన దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నామ‌న్నారు. శ‌నివారం పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను ఘ‌నంగా జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు. ఈనెల 26న స‌న్నాహ‌క స‌మావేశాల‌ను ఆయా జిల్లా కేంద్రాల‌లో నిర్వహించాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని అన్నారు కేటీఆర్.

నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా అంటే 28వ తేదీ సాయంత్రం లోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాల‌న్నారు. పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించాలని సూచించారు కేటీఆర్. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించాల‌ని, కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కెసిఆర్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలన్నారు.

దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు కేటీఆర్. కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్ సూచించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *