రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు . ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై మోహన్ యాదవ్ కి వివరించారు. అంతే కాకుండా దేశంలో ఎక్క‌డా లేని విధంగా, ఏ రాష్ట్రం అమ‌లు చేయ‌ని విధంగా తాము వ‌చ్చాక స‌న్న బియ్యాన్ని పేద‌ల‌కు పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో తాజాగా రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర ఆహార , పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి సైతం తాము అమ‌లు చేస్తున్న స‌న్న బియ్యం ప‌థ‌కాన్ని ప్ర‌శంసించార‌ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప‌థ‌కాన్ని దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల‌లో అమ‌లు చేయాల‌ని తాము సూచించామ‌ని, ఇందుకు ఆయ‌న స‌మ్మ‌తించార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే అధికారికంగా ఢిల్లీలో స‌మావేశం కూడా ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంతో క‌ల‌వ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *