ఛాయ్ రాస్తా అవుట్ లెట్ సూప‌ర్

ప్ర‌శంసించిన నారా భువ‌నేశ్వ‌రి

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లాలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. ఇందులో భాగంగా అన్ని వ‌ర్గాల వారిని క‌లుస్తున్నారు. క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. అక్క‌డ విద్యార్థినిల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. చ‌క్క‌గా చ‌దుకోవాల‌ని హిత‌బోధ చేశారు. విద్య‌తోనే వికాసం క‌లుగుతుంద‌న్నారు. అక్క‌డి నుంచి బిగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. స్వంతంగా బ‌స్సులో ప్ర‌యాణం చేశారు. తాను ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకున్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఇందుకు మ‌హిళా ప్ర‌యాణీకులు సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయ‌న మేలును మ‌రిచి పోలేమ‌న్నారు.

మ‌రో వైపు స‌ర్ ప్రైజ్ ఇచ్చారు నారా భువ‌నేశ్వ‌రి. ఓ మ‌హిళా కార్య‌కర్త పిలిచిన వెంట‌నే ఆమె ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. తాజాగా ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే సంకల్పంలో భాగంగా డ్వాక్రా మహిళలచే ఏర్పాటు చేసిన ఛాయ్ రాస్తా అవుట్‌లెట్‌ను ముఖ్యమంత్రి సతీమణి ప్రారంభించారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటైన ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌లో ఆమె మొదటి ఛాయ్‌ని కోనుగోలు చేశారు. చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచి చక్కగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందించిన చాయ్ రాస్తా చాలా సరికొత్తగా ఉందని అభినందించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *