వైరా రాజ‌కీయ జీవితానికి పునాది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన భ‌ట్టి విక్ర‌మార్క‌

ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా త‌న రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించారు. త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు వైరా కీల‌కంగా మారింద‌న్నారు. వైరా అభివృద్ధికి ఒకేరోజులో రూ.400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వైరా అంటేనే మ‌ల్లు కుటుంబ‌మ‌ని, ఇది త‌న‌కే కాదు త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు అది దోహ‌దంగా మారింద‌న్నారు. ఈ ప్రాంతంతో త‌న‌కు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌న్నారు. వైరా ప్రాజెక్ట్ లెఫ్ట్–రైట్ కెనాల్ లైనింగ్ పనులను రూ. 42 కోట్లతో మళ్లీ పనులు ప్రారంభిస్తున్నాం అన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

గిరిజన రైతులకు 5,000 బోర్లు, కరెంటు, సోలార్ యూనిట్లను అందిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం. వైరాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం రెండు స్లాబులు పూర్తి అయ్యాయని చెప్పారు. ప్రజల అభివృద్ధే మా ధ్యేయం అని స్ప‌ష్టం చేశారు. వైరా అభివృద్ధికి ఇదే ఆరంభం అని, ఇంకా ఎన్నో మంచి పనులు ముందున్నాయని అన్నారు. గాడి త‌ప్పిన అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌స్తుతం గాడిలో పెడుతున్నామ‌ని చెప్పారు. త‌మ స‌ర్కార్ విద్య‌, వైద్యం, ఉపాధి రంగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నామ‌ని అన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *