బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కురాలు, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు పంచుతున్నారని కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ చీరలు పంచడం లేదని మండిప‌డ్డారు. కేటీఆర్ పెట్టిన భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కో పోలింగ్ బూత్ లో ఒక్కో మంత్రితో రేవంత్ రెడ్డి ప్రచారం చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి. ఎన్ని కుట్రలు చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచారో రాష్ట్రమంతా చూశారని అన్నారు.

ఎన్నిక‌ల్లో అడ్డ‌గోలు హామీలు ఇచ్చి ఇప్పుడుచేతులెత్తేసింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు మ‌న్నె క‌వితా రెడ్డి. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, క‌ర్ర కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే వ‌చ్చేది గులాబీ ప్ర‌భుత్వ‌మేన‌ని అన్నారు. ప‌దే ప‌దే కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసు కోవ‌డం త‌ప్పా ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు . ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, అవినీతి, అక్రమాల‌కు పాల‌న కేరాఫ్ గా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *