శాంతి భ‌ద్ర‌త‌ను కాపాడాల్సింది దీదీ స‌ర్కారే

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్

ఢిల్లీ : ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను కేవ‌లం సంర‌క్ష‌కుడిని మాత్ర‌మేనని, అయితే శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఆదివారం గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని బెల్దంగాలో సస్పెండ్ చేయబడిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేసిన బాబ్రీ మసీదు శంకుస్థాపనపై గవర్నర్ సివి ఆనంద బోస్ స్పందించారు. శాంతి భద్రతలను కాపాడాలని నేను కఠినమైన సూచనలు ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.

లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో అవసరమైన చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని స్ప‌ష్టం చేశారు గ‌వ‌ర్న‌ర్. ఈరోజు శాంతియుతంగా ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరూ అనుమతించ బడరని వార్నింగ్ ఇచ్చారు. మనకు కావలసింది సమాజంలో శాంతియుతంగా ఉండ‌డం. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రశాంతంగా నిర్వ‌హించి నందుకు బెంగాల్ ప్రజలను తాను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. ఉమ్మడి ఆర్డర్‌ను నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని హైకోర్టు కూడా చాలా స్పష్టంగా పేర్కొందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *