కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్

విశాఖ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారాలి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ కార్యాల‌యాన్ని మంత్రి లోకేష్ తో క‌లిసి సీఎం ప్రారంభించారు.
ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందన్నారు. గతంలో హైదరాబాద్ లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేదన్నారు. క‌కానీ ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మారింద‌న్నారు . ఈ సంద‌ర్బంగా మంత్రి నారా లోకేష్ ప్ర‌సంగించారు. త‌మ‌ ముఖ్యమంత్రి ఓ జీపీఎస్, నిరంతరం అందరినీ అభివృద్ధి వెంట పరుగులు పెట్టిస్తార‌న్నారు.

రాష్ట్రంలో పెట్టిన ప్రతీ ప్రాజెక్టునూ ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి చేయూత అందిస్తామని చెప్పాం అన్నారు.ఇప్పుడు కాగ్నిజెంట్ కు కూడా అదే స్థాయి ప్రోత్సాహం అందిస్తామ‌న్నారు. కాగ్నిజెంట్ లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు నారా లోకేష్‌. ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ను అభివృద్ధిబాటలో నడుపుతుంటే ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు పురోగతి బాట పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వారిరువురూ 25 ఏళ్ల వయస్సున్న యువకుల్లా దేశ, రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నార‌ని తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *