టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో శుభ్ మ‌న్ గిల్ కు నో ఛాన్స్

కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ క‌మిటీ చైర్మ‌న్

ముంబై : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా వ‌చ్చే ఏడాది 2026లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. శ‌నివారం ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. గ‌త కొంత కాలంగా పూర్ ఫ‌ర్మారెన్స్ బాగా లేద‌ని అందుకే ఎంపిక చేయ‌లేద‌ని చెప్పాడు. త‌న వైస్ కెప్ట‌న్ స్థానంలో అక్ష‌ర్ ప‌టేల్ ను నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించాడు. గ‌త కొంత కాలంగా త‌ను 31 టి20 మ్యాచ్ లు ఆడాడు. 291 ర‌న్స్ మాత్ర‌మే చేశాడ‌ని, అందుకే సరైన ఓపెనింగ్ జోడీకి సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా జ‌ట్టుకు దూరంగా పెట్టిన రింకూ , కిష‌న్ ల‌కు ఛాన్స్ ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఇదే క్ర‌మంలో జితేష్ శ‌ర్మ స్థానంలో కిష‌న్ ప‌నికి వ‌స్తాడ‌ని రెండో వికెట్ కీప‌ర్ గా ప‌నికి వ‌స్తాడ‌ని ఎంపిక చేశామ‌న్నాడు అజిత్ అగార్క‌ర్. ఇక రింకూను ఫినిష‌ర్ గా ఉంటాడ‌ని తీసుకున్నామ‌న్నాడు. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *