విజ‌య‌వాడ‌లో ఆవ‌కాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివ‌ల్

జ‌న‌వ‌రి 8,9,10వ తేదీల‌లో నిర్వ‌హ‌ణ

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే యాక్ష‌న్ ప్లాన్ కూడా త‌యారు చేశారు. ఇదే క్ర‌మంలో యోగాంధ్ర పేరుతో విశాఖ‌లో రూ. 94 కోట్లు ఖ‌ర్చు చేసి స‌క్సెస్ చేశారు. భారీ ఎత్తున జ‌నం యోగాంధ్ర‌లో పాలు పంచుకున్నారు. తాజాగా మ‌రో కీల‌క‌మైన భారీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు కందుల దుర్గేష్. ఈ మేర‌కు రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ మేర‌కు ఆవ‌కాయ్ పేరుతో ఏకంగా ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి .

సోమ‌వారం ఇందుకు సంబంధించి ఉన్న‌తాధికారులు అజ‌య్ జైన్, అమ్రాపాలి కాటా తో క‌లిసి కందుల దుర్గేష్ ఫెస్టివ‌ల్ కు సంబంధించి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఇదిలా ఉండ‌గా ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహితోత్సవంపై పలు అంశాలను వివరించారు కందుల దుర్గేష్. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో దీనిని నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. జ‌న‌వ‌రి 8,9,10 తేదీల‌లో విజ‌య‌వాడ‌లోని పున్న‌మి ఘాట్, భ‌వానీ ఐ ల్యాండ్ ల‌లో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు కందుల దుర్గేష్. కాగా ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *