తెలంగాణ‌లో బీజేపీ ఎప్ప‌టికీ అధికారంలోకి రాదు

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దేశం మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం ఎప్పటికీ రానే రాద‌న్నారు. నిజామాబాద్ జిల్లాలో ధ‌ర్మ‌పురి అరవింద్ మళ్లీ గెలవడంటూ జోష్యం చెప్పారు. జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌నాపరంగా పూర్తిగా విఫ‌లం అయ్యింద‌న్నారు. దీంతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నార‌ని, అయినా సోయి లేకుండా పోయిందంటూ సీఎంను ఉద్దేశించి పేర్కొన్నారు. గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సత్తా చాటామ‌న్నారు. ఇక త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ దే హవా కొన‌సాగ‌డం ఖాయ‌మ‌న్నారు జీవ‌న్ రెడ్డి.

విచిత్రం ఏమిటంటే త‌మ‌ ప్రభుత్వ హయంలో చేసిన పనులను కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ప్రారంభిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మై పోయింద‌న్నారు మాజీ ఎమ్మెల్యే. జిల్లాలో సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, అరవింద్ అందరూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జీవ‌న్ రెడ్డి. ఇప్పుడు తాము ఎక్కడికెళ్లినా మళ్ళీ కెసిఆర్ సారే రావాలని అంటున్నార‌ని చెప్పారు. ఈ విష‌యం ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి, నేత‌ల‌కు, సీఎంకు అర్థ‌మైంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *