newsseals.com
News

లోక్ స‌భ స్పీక‌ర్ తో వైసీపీ ఎంపీలు ములాఖ‌త్

Posted by: VijayaBhaskar February 3, 2026
newsseals-YSRCPMPS

స‌మ‌ర్థ‌వంత‌మైన నిర్వ‌హ‌ణ‌పై విస్తృతంగా చ‌ర్చ‌

న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని పార్ల‌మెంట్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఎంపీలు పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు, లోక్‌సభ కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ప్ర‌ధానంగా పార్లమెంట్ పనితీరును మరింత మెరుగు పరచడానికి ఎంపీల అభిప్రాయాలు, సూచనలను స్పీకర్ ఓం బిర్లా ఎంపీల‌ను కోరారు. సభా వ్యవహారాలు మరింత సజావుగా సాగేందుకు కొత్త విధానాలు, మెరుగైన సమన్వయం, బలమైన మద్దతు వ్యవస్థలు అవసరమని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ ఎంపీలు.

అదేవిధంగా ఎంపీలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ప్రతిపాదనకు స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు.
ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి , అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లాను శాలువాతో సత్కరించారు.