లోక్ స‌భ స్పీక‌ర్ తో వైసీపీ ఎంపీలు ములాఖ‌త్

స‌మ‌ర్థ‌వంత‌మైన నిర్వ‌హ‌ణ‌పై విస్తృతంగా చ‌ర్చ‌

న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని పార్ల‌మెంట్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఎంపీలు పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు, లోక్‌సభ కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ప్ర‌ధానంగా పార్లమెంట్ పనితీరును మరింత మెరుగు పరచడానికి ఎంపీల అభిప్రాయాలు, సూచనలను స్పీకర్ ఓం బిర్లా ఎంపీల‌ను కోరారు. సభా వ్యవహారాలు మరింత సజావుగా సాగేందుకు కొత్త విధానాలు, మెరుగైన సమన్వయం, బలమైన మద్దతు వ్యవస్థలు అవసరమని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ ఎంపీలు.

అదేవిధంగా ఎంపీలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ప్రతిపాదనకు స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు.
ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి , అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లాను శాలువాతో సత్కరించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *