భూగ‌ర్భ జ‌లాల‌పై దృష్టి సారించాలి : సీఎం

నీటి వినియోగ‌దారుల సంఘాల స‌మావేశంలో

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చేది వేస‌వి కాలం అని భూగ‌ర్భ జ‌లాలు త‌గ్గిపోయే అవ‌కావశం ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి నీటి వినియోగంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు.
సమావేశ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఏమేరకు ఉన్నాయి, భూగర్భజలాల రీఛార్జి స్ట్రక్చర్ల నిర్మాణం తదితర అంశాల‌పై ఫోక‌స్ పెట్టాల‌న్నారు సీఎం.

ప్రదర్శన వద్ద వ్యవయసాయానికి ఉపయోగపడే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్ల సాంకేతికతను ప‌రిశీలించారు. వీటి వినియోగించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్ప‌టికే కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక సాగు, తాగు నీటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టికే రూ. 8,000 కోట్లు కేవ‌లం ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు మంజూరు చేశామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగాన్ని నిర్ల‌క్ష్యం చేసింద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. రైతుల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *