తిరుప‌తి న‌గ‌ర భ‌విష్య‌త్తుకి బ‌డ్జెట్ ఉప‌యోగ ప‌డాలి

స్ప‌ష్టం చేసిన మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌
తిరుప‌తి : మ‌నం ప్ర‌తిపాదించి, ఆమోదించిన బ‌డ్జెట్ తిరుప‌తి న‌గ‌ర భ‌విష్య‌త్తుకు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. బడ్జెట్ ప్రతిపాదనలు, మన చర్చలను పరిశీలించిన తిరుపతి నగర ప్రజలకు తాము చెల్లిస్తున్న ప్రతి రూపాయిని తాము ఎన్నుకున్న ప్రతినిధులు చాలా జాగ్రత్తగా , బాధ్యతగా ఖర్చు పెడుతున్నారనే న‌మ్మ‌కాన్ని క‌లిగించాల‌ని స్ప‌ష్టం చేశారు. మా గురించే.. మా ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని భావించాలని అన్నారు. ఎందుకంటే మనం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజల పన్నుల ద్వారానే అన్న విషయం మరిచి పోకూడదన్నారు. అందుకే బడ్జెట్ చర్చలో పాల్గొనే నాతో సహా ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా ఉండాల‌ని పేర్కొన్నారు.

తిరుపతి నగర ప్రజల సాధారణ రోజువారీ అవసరాలు తీరాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమ‌ని, భవిష్యత్తు నగర అభివృద్ధి అవసరమైన మౌలిక వసతుల కోసం మన ఆలోచనలు ఉండాలన్నారు. గత బడ్జట్ ప్రతిపాదనలు , ఖర్చు చేసిన విధానం పై హేతుబద్ధమైన చర్చ చేయాల‌ని సూచించారు. బడ్జెట్ లో కీలకమైన అంశం ఆదాయం.. ఆదాయ వ్యయాలపై ప్రతి సభ్యులు స్పష్టంగా మాట్లాడాలి. ఏ నగరానికి లేని అవకాశం మన తిరుపతి నగరానికి ఉన్నదని చెప్పారు.. శ్రీవారి పాదాల చెంత నెలకొన్న నగరం కాబట్టి టిటిడి, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి విలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *